ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానో కంటే చిన్న కారు.. గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే కానీ!

national |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 02:40 PM

నానో కారు.. ఆటోమొబైల్‌ రంగంలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన కారు మోడల్ ఇది. తాజాగా ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. ఇది నానో కారు కంటే చిన్నదైన కారు కావడంతో మరోసారి ఆటో మొబైల్ రంగంలో ఆసక్తి పెరిగింది. టయోటా సీప్లస్‌ పాడ్‌ పేరుతో గతేడాది డిసెంబర్ లో జపాన్ లో ఈ మోడల్ ను ఆవిష్కరించగా ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ కారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టయోటా సీ+పాడ్‌ ఎలక్ట్రిక్‌ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. సీ+పాడ్ 9.06 kWh లిథియం అయాన్ బ్యాటరీను అమర్చారు. గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. స్టైలింగ్ పరంగా, టయోటా సీ+పాడ్ ఎల్‌ఈడీ హెడ్ లైట్స్‌, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో రానుంది. బరువును తగ్గించేందుకు బయటి ప్యానెల్‌లను పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారు చేశారు. 


టయోటా సీ+పాడ్‌ ఎక్స్‌, జీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఎక్స్‌ ట్రిమ్ ధర 1.65 మిలియన్ యెన్ (సుమారు రూ.11.75 లక్షలు)గా ఉండగా, జీ ట్రిమ్ ధర 1.71 మిలియన్ యెన్ (సుమారు రూ. 12.15 లక్షలు)గా ఉంది. ధర విషయంలో వినియోగదారుల ఆదరణ లభిస్తుందో లేదో అనే సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కాగా సామాన్య మధ్యతరగతి వారికి సైతం కారు ప్రయాణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ నానో కార్ ను చాలా సంవత్సరాల క్రితమే మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారీ అంచనాలతో అడుగు పెట్టిన ఈ కారు మార్కెట్లో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా ఉత్పత్తిని సైతం ఆపేసింది. ఈ నేపథ్యంలో వస్తున్న టయోటా సీప్లస్‌ పాడ్‌ ఏ మేరకు మార్కెట్ షేర్ తీసుకుంటుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa