బంగారు, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త చేదు అంశమే. సోమవారంనాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధరలు సోమవారంనాడు మాత్రం కొద్దిగా పైకి కదిలాయి. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ పైకి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర కాస్త పెరిగిందని చెప్పవచ్చు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.49,490కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 పెరుగుదలతో రూ.45,360కు చేరింది.
బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి రేటు కూడా స్వల్పంగానే పెరిగింది. సిల్వర్ ధర రూ.100 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,200కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. ఔన్స్కు 0.06 శాతం ఎగసింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1812 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్కు 0.28 శాతం పెరుగుదలతో 23.01 డాలర్లకు చేరింది.
బంగారం ధరలపై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు ప్రభావం చూపాయి. ఇదిలావుంటే బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత కాలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa