రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఏకపక్షంగా విద్యాహక్కు చట్టపు నిబంధనలను సవరిస్తూ జీఓ నెం. 20 సవరణలు తెస్తూ నేడు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సీపీఎం పార్టీ తపుపట్టింది. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏండ్లలోపు పిల్లలకు 1కి.మీ లోపునే పాఠశాల వుండాలి. మన దేశపు గ్రామీణ సామాజిక ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో వుంచుకొని, పార్లమెంటు చేసిన చట్టం ఇది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం దీనిని పాటిస్తూ వచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన 6 రకాల పాఠశాలలను దృష్టిలో వుంచుకొని రాష్ట్రప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల పరిధిని 3 కి.మీటర్లకు పెంచింది. ఫలితంగా ప్రస్తుతం 1 కి.మీ లోపునే అందుబాటులో వున్న ప్రాథమిక పాఠశాలలు కనుమరగవుతాయి. 3`5 తరగతుల పిల్లలు కూడా 3 కి.మీ దూరంలోని ఫ్రీహైస్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రమూ చేయని దుస్సాహసం ఇది. పిల్లల ప్రాథమిక హక్కుకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుంది. పేదపిల్లలకు బడిదూరం 3 రెట్లు పెరుగుతుంది. దీనితోపాటు వేల ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయి. ఉపాధ్యాయుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది. ప్రపంచబ్యాంకుతో సాల్ట్ పేర రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొన్న ఒప్పందంలో బాగంగానే ఈ సంస్కరణకు పూనుకొంది. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, రాని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని విజ్ఞప్తి చేస్తున్నాం. అని ఆ పార్టీ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa