international | Suryaa Desk | Published :
Tue, Dec 28, 2021, 08:26 AM
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 185 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 267 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 68 పరుగులకే కుప్పకూలింది. 31/4 ఓవర్నైట్ స్కోర్తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. మరో 37 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి మ్యాచ్ లోనే ఆరు వికెట్లతో అదరగొట్టిన ఆసీస్ బౌలర్ బోలాండ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa