ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాదికి భారత్ లో 5జీ సేవలు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 08:37 AM

భారత్ లోని ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఏడాదికి 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగరాల లిస్ట్ లో హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌ నగర్, అహ్మదాబాద్, చెన్నై, గాంధీనగర్, లఖ్‌నవూ, పుణె నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లోనే వచ్చే ఏడాది 5జీ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికే ఆయా నగరాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 4జీ కన్నా 5జీ లో ఎక్కువ సదుపాయాలు, వేగంగా ఇంటర్నెట్ పొందే అవకాశం ఉంటుంది. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సహా కీలక టెలికాం ఆపరేటర్లు, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కృషి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa