విజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థులు నిరసనలు తెలిపారు. కాలేజీలో జరుగుతున్న మొదటి సంవత్సర ఐ. హెచ్. సి పరీక్షను 130 మంది కురుపాం వైరిచర్ల డిగ్రీ కళశాల విద్యార్థులు బాయ్ కట్ చేశారు. స్లిప్ లు తెచ్చారంటూ అక్కడ ఇక్కడ వెతుకుతూ వేధిస్తున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజి సిబ్బంది పై చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైటాయించి న్యాయం జరగలంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రామయ్య మాట్లాడుతూ కురుపాం వైరిచర్ల డిగ్రీ కళశాల విద్యార్థునిలు స్లిప్ లతో దొరికినందుకు, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఉద్దేశ్యం తో కాలేజి హిస్టరీ అధ్యపకురాలు శ్రీవాణి తో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. పరీక్షలు పగడ్బందిగా నిర్వహిస్తున్నమనే ఇలాంటి ధర్నాలు చేపడుతున్నారని అన్నారు. ఈ విషయం పై దర్యాప్తు చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa