ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 05:50 PM

సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 113 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా 3, షమీ 3, సిరాజ్ 2, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ లో బావుమా(35*) టాప్ స్కోరర్. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 327, రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 197 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సెంచూరియన్‌ వేదికలో సౌతాఫ్రికాపై గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యాన్ని సంపాదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa