దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదిలావుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఏడాది కూడా ఆర్ధిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు కూడా తగ్గిపోవడంతో అప్పులు తీర్చేందుకు సైతం కొత్త అప్పులు చేసుకుంటూ వెళ్లింది. ఎన్ని ఇబ్బందులున్నా, నిధుల రాక తగ్గిపోతున్నా ప్రభుత్వం మాత్రం తన సంక్షేమ పథకాల్ని కొంత పుంతలు తొక్కించుకుంటూ ఏకంగా పతాకస్దాయికి తీసుకెళ్లింది. భారీ ఎత్తున అప్పులు చేసి మరీ సంక్షేమ రథాన్ని నడిపిస్తోంది. ఇదే క్రమంలో గతంలో ఏదైనా కారణంతో సంక్షేమ పథకాలు అందని వారికి సైతం తాజాగా ఏడాదికి రెండుసార్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం బహుశా దేశంలోనే ప్రప్రధమంగా నిలిచింది. తాజాగా సీఎం జగన్ ఈ కార్యక్రమం కింద రూ.703 కోట్లు విడుదల చేశారు.
ఏపీలో ఈ ఏడాది సంక్షేమ పాలన కొత్త పుంతలు తొక్కింది. నవరత్నాల పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో ఎలాగైనా అమలు చేసి తీరాలన్న సీఎం జగన్ పట్టుదలతో ప్రభుత్వం, అధికారులు పరుగులు పెట్టారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, విద్యార్ధులు, తల్లులు, ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని ఈ ఏడాది కూడా విజయవంతంగా కొనసాగించింది. ఇప్పటికే సంక్షేమ పథకాల కోసమే ఏడాదికి దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని పేరు తెచ్చుకున్న ప్రభుత్వం మరో ఏడాది కూడా విజయవంతంగా ఆ స్ధాయి ఖర్చుపెట్టింది. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఏడాది పతాకస్ధాయికి చేరుకున్నాయి. గతంలో ప్రకటించిన పథకాలతో పాటు మధ్యలో తీసుకున్న పథకాలు కూడా అమలు చేయాల్సిన పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురైంది. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa