ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా స్కూటీ..ఎంట్రీ ఇచ్చిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 08:05 PM

వంగవీటి రాధా అంశం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. ఆయన చుట్టు, ఇంటి వద్ద ఏం జరిగిన ఇపుడు అది పెద్ద వార్తఅవుతోంది. తాజాగా వంగవీటి రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా ఉన్న ఓ స్కూటీ కలకలం రేపింది. వంగవీటి రాధా ఆఫీస్ ముందు గత కొన్ని రోజులుగా అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉండడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకుని, స్కూటీ ఎవరిదన్న దానిపై దర్యాప్తు నిర్వహించారు. ఇదే సమయంలో వంగవీటి రాధా కార్యాలయాన్ని కూడా ఇంటెలిజెన్స్ మరియు ఎస్బి పోలీస్అధికారులు పరిశీలించారు. రాధా కార్యాలయం దగ్గర వివరాలను కూడా సేకరించారు. రాధా కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న స్కూటీ నాని అనే వ్యక్తికి చెందినదని పోలీసులు గుర్తించారు. నానీని రాధా కార్యాలయం పక్కన ఉన్న స్వీట్ షాప్ లో పని చేసే వ్యక్తి స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. వాహన పత్రాలను చూపించిన తర్వాత స్కూటీ తీసుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. స్కూటీ లో ఏమి లేకపోయేసరికి రాధా అనుచరులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ వంగవీటి రాధాను చంపటానికి రెక్కీ నిర్వహించారన్న వార్త మాత్రం అనుచరులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో తాజాగా వంగవీటి రాధా తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని చేసిన వ్యాఖ్యలు, హత్య రాజకీయాల ఆరోపణలు బెజవాడ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చిన్న గొన్నూరు లో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లిన రాధ కొందరు తన హత్యకు కుట్ర చేశారని, రెక్కీ కూడా నిర్వహించారని, హత్యకు కుట్ర చేసిందెవరో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే రాధాకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa