రద్దీ తగ్గించేందుకు సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్-లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఒక వైపు సంక్రాంతి రద్దీ.. మరో వైపు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సందడి. దీంతో ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. సాధారణ రైళ్లతో పాలుగా సంక్రాంతి సమయంలో కొద్ది రోజుల క్రితమే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. అయినా ఇంకా రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు చాంతాడులా ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సర్వీసుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ సమయంలో రద్దీ తగ్గించేందుకు సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్-లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. గత రెండేళ్లు కరోనా కారణంగా సంక్రాంతి .. శబరి మల వెళ్లే వారి సంఖ్య గణణీయంగా తగ్గింది. ఈ సారి మాత్రం గతంలో మాదిరిగానే పలువురు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా, దక్షిణ మధ్య రైల్వే శాఖ చేసిన ప్రకటన మేరకు రైలు నంబర్ 07275 జనవరి 3, 5, 7 తేదీలలో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07276) జనవరి 4, 6, 8 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa