ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా రేమిణిశెట్టి హనుమంతరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 03:34 PM

గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెం గ్రామానికి చెందిన రేమిణిశెట్టి హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్. ఎస్. యూ. ఐ ఉపాధ్యక్షులుగా, యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా, ప్రస్తుత మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను అందించిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా తనను నియమించడం జరిగిందని తెలిపారు.


ఈ మేరకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావుల చేతుల మీదుగా తన నియామకపు ఉత్తర్వులను అందజేసినట్లు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలకా విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. కాగా తన పదవీ నియామకానికి కృషి చేసిన పార్టీ నేతలకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa