కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది మూడో సెషన్లోనూ మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభం తర్వాత సూచీలు స్వల్పంగా నష్టపోయినప్పటికీ... మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 60,223 వద్ద ముగిసింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 17,925 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్ ఇండెక్స్లు లాభాల బాట పట్టాయి.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
బజాజ్ ఫిన్సర్వ్ (5.09%), బజాజ్ ఫైనాన్స్ (4.44%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.70%), యాక్సిస్ బ్యాంక్ (2.56%) మరియు టాటా స్టీల్ (2.46%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.87%), ఇన్ఫోసిస్ (-2.71%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (-1.69%), విప్రో (-1.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.00%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa