జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠం ద్వారా సర్వదర్శనం టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో తిరుపతి వాసులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం తిరుపతిలో 5 చోట్ల టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టోకెన్ల జారీ కేంద్రాలను అదనపు ఈవో పరిశీలించారు.
10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. మున్సిపల్ కార్యాలయం, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల, ముత్యాలరెడ్డి పల్లె, రామచంద్ర పుష్కరిణి సమీపంలో టోకెన్ల జారీకి కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టిక్కెట్లను అందజేస్తాం. టికెట్ పొందిన భక్తులను ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం గుండా తిరుమలకు అనుమతిస్తారు. భక్తులందరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి’’ అని ధర్మారెడ్డి సూచించారు.
ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని గతేడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. సాధారణ ప్రజలకు ఎక్కువ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22 వరకు వీఐపీల సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. ఈ పదిరోజుల్లో చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు అందవు. వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు స్వయంగా వచ్చిన ప్రముఖులకు అందజేస్తారు. అంతేకాకుండా జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలోని వసతి గృహాల అడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేసి కరెంట్ బుకింగ్పై భక్తులకు కేటాయిస్తుంది టీటీడీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa