కృష్ణా జిల్లా: గత రెండు రోజులక్రితం పంజాబ్ రాష్ట్రంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రరంభోత్సవాల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో చూపిన నిరంకుశ వైఖరికి నిరసనగా శనివారం గుడివాడ పట్టణం లోని గాంధీ మండపం దగ్గర గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ మౌన దీక్ష చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా బిజెపి అధ్యక్షులు మట్టా ప్రసాద్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటక్రిష్ణ లు మాట్లాడుతూ దేశ ప్రధాని కె భద్రత ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజలకు ఏం ఇస్తుందని వారు విమర్శించారు. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ రాష్టృప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ గారిని దేశ ప్రధాని గానె కాకుండా మనదేశ సంపదగా చూడాలని అన్నారు. దేశం యావత్తు మోడీ గారి వెన్నుగా ఉందని ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుత్తికొండ శ్రీ రాజబాబు అసెంబ్లీ కన్వీనర్ సూరే గాంధీ , పట్టణ అధ్యక్షులు అంగడాల సతీష్ మాజీ అధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa