కుప్పం పర్యటన లో చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు ఎన్ని మాటలు చేసినా ప్రజలు ఆయనని నమ్మరని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు.టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడం అన్యాయమన్నారు. రైతులను రాజులను చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మనదేనని మంత్రి అన్నారు. విత్తనం నుంచి అమ్మకం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించిన ప్రభుత్వం మాదేనని మంత్రి అన్నారు. రైతు భరోసా కేంద్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి , చంద్రబాబు ఇది రాసి పెట్టుకోవాలని మంత్రి తెలిపారు. సచివాలయాల ఏర్పాటుతో లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని రంగాల్లో ఉన్న ఖాళీలను కూడ భర్తీ చేస్తున్నామన్నారు. జాబ్ చార్ట్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు ఇవన్నీ కనిపించట్లేదా అని చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు మంత్రి అప్పల రాజు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa