ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 7.65 దొంగతనం కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 07:49 PM

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్లు పట్టింది, ఒక కేసులో తుది తీర్పు రావడానికి. అవును మీరు విన్నది నిజమే! అయితే ఇన్నేళ్ల సమయం పట్టిందంటే ఏ ఆస్తి వివాదమో, ఏ హై ప్రొఫైల్ కేసు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. 1977లో జరిగిన దొంగతనం కేసులో తుది తీర్పు వెలవడటానికి ఇంత సమయం పట్టింది. అది కూడా కేవలం రూ. 7.65 కోసం. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఆచూకీ కూడా ఇప్పటివరకు పోలీసులు తెలుసుకోలేక పోయారు. తాజాగా ఈ కేసును ముగింపు పలికింది కోర్టు. ఆ వివరాలు..


మహారాష్ట్రలో ఐదు దశాబ్దాల నాటి దొంగతనం కేసు ఎట్టకేలకు ముగిసిపోయింది. పాత కేసులు ఎక్కువై.. న్యాయ వ్యవస్థపై భారం పడుతోంది. దీంతో ఇలాంటి కేసులపై దక్షిణ ముంబయిలోని మజగావ్‌ న్యాయస్థానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 1977 నాటి రూ. 7.65 చోరీ కేసు ఇప్పటికీ పెండింగులోనే ఉన్న విషయం మజగావ్ కోర్టు దృష్టికి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఉన్నారు. వీరిని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన ఏళ్లుగా వెతికినప్పటికీ ఆచూకీ దాదాపు రూ. 7.65 అనేది అప్పట్లో పెద్ద మొత్తమే అయినా.. దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు.


కాగా, జనవరి 14న ఈ కేసు మజగావ్‌ కోర్టు ముందుకు వచ్చింది. దీంతో నిందితులు, ఫిర్యాదుదారుడి ఆచూకీ తెలియకపోవడం, 50 ఏళ్లుగా కేసు పెండింగ్‌లో ఉండటాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇలా సంవత్సరాల పాటు ఎలాంటి పురోగతి లేకుండా ఉండటం అనవసరమని, ఇంకా దీన్ని విచారణలో ఉంచడటం భావ్యం కాదని కోర్టు భావించింది. దీంతో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి ఆర్తి కులకర్ణి ఈ కేసు కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


కాగా, తీర్పు సందర్భంగా నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ కేసులో రికవరీ చేసిన రూ. 7.65లను ఫిర్యాదుదారుడికి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ అప్పీలు గడువు ముగిసే రోజు నాటికి ఫిర్యాదుదారుడి ఆచూకీ లభించకపోతే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమచేయాలని మజగావ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పంబాజ్ హర్యానా హైకోర్టు ఇలాంటి ఓ కేసుకు ముగింపు పలికింది. 62 ఏళ్ల తర్వాత సీకే ఆనంద్ అనే వ్యక్తికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కేసు మొదలైతే.. అతడికి 80 సంవత్సరాలు వచ్చేసరికి ఈ కేసు గెలిచాడు. కేవలం దాదాపు రూ. 18,000కే రూ. 7 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ దక్కింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa