ఆవేశం ఎంతో విలువైంది. దానిని ఎపుడు పడితే అపుడు వాడితే అనర్థాలే. మధ్యప్రదేశ్లో కుక్కను చంపినందుకు ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఆ అవమాన భారం తట్టుకోలేక ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. రేవాలోని లంగర్ పుర్వా అనే గ్రామానికి చెందిన రాజ్ కరణ్ విశ్వకర్మ (28) అనే యువకుడు ట్రక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే అతని ట్రక్ కింద పడి ఓ కుక్క పిల్ల చనిపోయింది. ఆ కుక్క చనిపోవడంతో ఆగ్రహానికి గురైన సందీప్ పటేల్, చోటు అనే ఇద్దరు యువకులు ఇంటికి వెళ్లి రాజ్ కరణ్పై దాడి చేశారు. విపరీతంగా కొట్టారు. దాంతో కరణ్ మనస్థాపానికి గురయ్యాడు. తర్వాత గదిలో రాజ్ కరణ్ ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించాడు. అవమాన భారంతో రాజ్ కరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అయితే కరణ్ బంధువులు మాత్రం ఇది హత్యే అంటున్నారు. సందీప్ పటేల్, చోటులు కొట్టి తర్వాత కరణ్కు ఉరి వేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. దాంతో ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ శివకుమార్ వర్మ తెలిపారు. ఇటీవలె మధ్యప్రదేశ్లో మొక్క కోసం ఓ బాలుడు.. మరో బాలుడిని కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. అక్కడ బుర్హాన్పూర్ జిల్లాలోని షెఖ్పూర్ గ్రామంలో జనవరి 26వ తేదీన 12 ఏళ్ల బాలుడు తన వ్యవసాయ పొలాన్ని పర్యవేక్షిస్తుండగా ఓ మొక్కను పీకేశాడనే కోపంతో ఏడేళ్ల బాలుడిపై దాడి చేశాడు. విపరీతంగా కొట్టాడు. దాంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa