ఎన్నికల్లో పోటీ చేయాలన్న తప్పన మనిషిని ఎంతటికైనా తీసుకెళ్తుందటా. తనకు రెండో భార్య కావాలంటూ ఓ వ్యక్తి భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసి.. ఆమెకు ఎటువంటి లక్షణాలుండాలో అందులో వివరించాడు. ఈ విచిత్రమైన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడి రెండో పెళ్లి వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉంది. త్వరలో ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రమేశ్ వినాయక రావ్ పాటిల్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ, అతడికి ముగ్గురు కావడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. దీంతో ఎలాగైనా ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న రమేశ్కు ఓ ఆలోచన వచ్చింది. తనకు బదులుగా కుటుంబం నుంచి ఒకరిని పోటీని నిలపాలని భావించాడు. అందుకు రెండో వివాహం చేసుకుని ఆమెను ఎన్నికల్లో పోటీ చేయించాలనేది అతడి కోరిక. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా ఔరంగాబాద్ నగరం మొత్తం బ్యానర్లు కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఆ హోర్డింగుల్లో పేర్కొన్నాడు. మతంతో సంబంధం లేదని.. అవివాహిత లేదా పెళ్లయి భర్త నుంచి విడిపోయినా, భర్త మరణించిన 25-40 ఏళ్ల మహిళలు అర్హురాలని తెలిపాడు. ఒకవేళ పెళ్లయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు విధించాడు. బ్యానర్లపై తన చిరునామా, మొబైల్ నంబర్ సైతం ముద్రించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు. మరోవైపు, దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కట్టించిన బ్యానర్లను చించేస్తున్న మహిళా కార్యకర్తలు.. ఇది తమ ఆత్మ గౌరవాన్ని కించపరచడమేనని మండిపడుతూ నిరసన తెలుపుతున్నారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa