ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 08:26 AM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌-అగర్తల-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి సోమవారం ఈ రైలు(07030) సికింద్రాబాద్‌లో 16. 35 గంటలకు బయలుదేరి గుంటూరు 21. 10, విజయవాడ 22. 05, అగర్తల గురువారం 03. 00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07029) ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి శుక్రవారం, ఏప్రిల్‌ 1న అగర్తలలో 06. 10 గంటలకు ప్రారంభమై ఆదివారం విజయవాడ 08. 20, గుంటూరు 09. 35, సికింద్రాబాద్‌ 16. 15 గంటలకు వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa