విశాఖపట్నం: నాతవరం మీదుగా గంజాయి రవాణా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఐజి కాంతారావు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాతవరం పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం శాంతి భద్రతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ నుంచి నాతవరం మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి రవాణా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మండలంలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఐజి వెంట నర్శీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa