ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో తెదేపా, జనసేన, ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులు ఎవరూ పాల్గొనలేదని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. ఉద్యోగుల మేలు కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో పాటు ఎవరు మద్దతిచ్చినా మంచిదేనని చెప్పారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావడంతో ‘చలో విజయవాడ’ విజయవంతమైందన్నారు.
విజయవాడ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి ఉద్యమం చూడలేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజలల్లో వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. నిన్నటి ఆందోళనపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రేపు సెలవు రోజు కావడంతో నేడే సచివాలయంలో పెన్డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa