ఉద్యోగ ఉపాధ్యాయ నిరసన కార్యక్రమం ఎమర్జెన్సీ ని తలపించిందని వినుకొండ మాజీ ఎమ్యెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉద్యోగస్తులు ను నిర్బంధించి నిరసన కార్యక్రమాన్ని అణచి వేయాలని చూసిన ఉవ్వెత్తున లక్షలాది మంది విజయవాడలో ఉద్యోగులు ప్రత్యక్షమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తరన్నారు. ఈ ప్రభుత్వానికి పాడే కట్టారని ఇంక స్మశాననికి పంపించడమే మిగిలిందన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని తెలిపిన జగన్ రెడ్డి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఆర్ధిక మంత్రి ఎక్కడ ఉన్నాడో కనపడట్లేదని మంత్రులందరూ డమ్మీలయ్యారని సజ్జల రామకృషారెడ్డి ఒక్కడే అన్ని మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నడని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa