ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా శాంపిళ్ల కోసం వికృత చేష్టలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 07:21 PM

కరోనా కోరలు చాస్తున్న వేళ వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ వైద్య సేవలందించారు. మహమ్మారి సోకిన వారి ప్రాణాలను నిలబెట్టడంలో వారు చూపిన తెగువ ప్రశంసనీయం. అయితే కొందరు ఆరోగ్య కార్యకర్తల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కరోనా శాంపిళ్ల కోసం వచ్చిన ఓ మహిళతో ల్యాబ్ టెక్నీషియన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. శాంపిళ్ల సేకరణలో మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. దీనిపై రెండేళ్ల క్రితం నమోదైన కేసులో న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


మహారాష్ట్రలో కరోనా మొదటి వేవ్ విజృంభిస్తున్న సమయంలో 2020 జులై 20న అమరావతిలో ఒక మాల్ ఉద్యోగికి కరోనా పరీక్ష పాజిటివ్ వచ్చింది. దీంతో మాల్‌లోని ఉద్యోగులందరినీ బద్నేరాలోని ట్రామా కేర్ సెంటర్‌కు యాజమాన్యం పంపింది. ఉద్యోగులందరి నుంచి శాంపిళ్లను తీసుకున్న తర్వాత, ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్‌ముఖ్ ఒక మహిళా ఉద్యోగికి పాజిటివ్ వచ్చిందని సమాచారం అందించాడు. మరోసారి పరీక్ష చేయించుకోవాలని, ల్యాబ్‌కు రావాలని కోరారు. దీంతో బాధితురాలు మరోసారి అతడి ల్యాబ్‌కు వెళ్లింది.


ల్యాబ్‌కు వచ్చిన మహిళ మర్మాంగం నుంచి నిందితుడు శాంపిళ్లను తీసుకున్నాడు. దీనిపై అనుమానం వచ్చి, ఈ విషయాన్ని తన సోదరుడికి బాధితురాలు తెలిపింది. మహిళ సోదరుడు దీనిపై వైద్యుల వివరణ కోరాడు. అలా శాంపిల్‌ను తీసుకోరని వాళ్లు తెలిపారు. దీంతో ఆ ల్యాబ్ టెక్నీషియన్‌పై బాధిత మహిళ బద్నేరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నరగా కోర్టులో వాదోపవాదాల అనంతరం తాజాగా అమరావతి సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి పదేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa