తన భార్య శిల్పాశెట్టి పేరుమీద తన ఆస్తులను వదిన ఇస్తూ రాజ్ కుంద్రా నిర్ణయం తీసుకున్నారు. ర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ, బెయిల్ పై బయట ఉన్న రాజ్ కుంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని జుహూ సమీపంలో తన పేరిట ఉన్న ఖరీదైన ఆస్తులను అర్ధాంగి, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేరు మీదకు మార్చేశారు. వీటి విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న జరిగిన ఈ లావాదేవీ వివరాలను జప్ కే డాట్ కామ్ వెలుగులోకి తీసుకొచ్చింది. జుహూలోని గాంధీగ్రామ్ రోడ్డులో సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. కుంద్రా దంపతులు ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇందులో మొదటి అంతస్తులోని ఐదు ఫ్లాట్స్ కుంద్రా పేరుమీదే ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు. ప్రస్తుత మార్కెట్ విలువ ఒక్కో చదరపు అడుగు రూ.65,000గా ఉంది. ఈ లావాదేవీలో భాగంగా శిల్పాశెట్టి రూ.1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. తన పేరిట ఉన్న ఆస్తులను రాజ్ కుంద్రా భార్య పేరిట ఎందుకు మార్చారనే వివరాలు బయటకు రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa