నేటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వివిధ వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కరోనా కేసులు నిత్యం నమోదవుతున్నాయి. కానీ ఐసీయూలో చికిత్స పొందాల్సిన ఆవశ్యకత తక్కువ మందికే కలగడంపై పరిశోధనలు తీవ్రంగా సాగాయి. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండడమే దీనికి కారణమనే వాదన ఇప్పటి వరకూ వినిపించింది. అయితే అది మాత్రమే కారణం కాదని, తీవ్ర పరిస్థితికి మరో కారణం కూడా ఉందని సైంటిస్టులు సరికొత్త విషయాన్ని వెల్లడించారు.
పేషెంట్లు ఐసీయూలో చేరే పరిస్థితిని కల్పించే కారణంపై సైంటిస్టుల తాజా పరిశోధనల్లో స్పష్టత వచ్చింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో లంగ్స్లో రక్తనాళాలు దెబ్బతినడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతున్నాయి. దీనికి ఎండోథీలియమే ప్రధాన కారణమని సైంటిస్టులు తేల్చారు. రక్త నాళాల్లోని చుట్టూ ఉండే కణజాలాన్ని రక్తం తాకకుండా అడ్డుగా ఉండే పొరనే ‘ఎండోథీలియం’ అంటారు. కరోనా వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై, ఎండోథీలియల్ కణాలు తీవ్రంగా స్పందిస్తున్నాయని తేలింది. లంగా రియాక్ట్ అవుతున్నాయట. దీంతో పలురకాల ప్లాస్మా ప్రొటీన్లు విడుదలవుతున్నాయి. దీనిపై జర్మన్కు చెందిన క్రిస్టీన్ ఫాక్ బృందం విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. పొర బాగైతే కరోనా పేషెంట్లు నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. దీనిని స్పష్టంగా చెప్పేందుకు, మరిన్ని ఆధారాల కోసం పరిశోధిస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa