ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయులకు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం: మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 23, 2026, 03:53 PM

లోక్‌సభలో ప్రధాని మోదీ పశ్చిమాసియా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు. యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అనేక దేశాధినేతలతో మాట్లాడామని తెలిపారు. ఇప్పటివరకు 3.75 లక్షల మందిని సురక్షితంగా భారత్‌కు తరలించామని, వీరిలో ఇరాన్ నుంచి 1000 మంది ఉన్నారని మోదీ పేర్కొన్నారు.మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నట్లే ఈ సంక్షోభాన్ని కూడా దేశం జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధన అవసరాల కోసం భారత్ 41 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోందని, హర్మూజ్ జలసంధి ద్వారా సరఫరాలో అంతరాయం కలగడం సమస్యగా మారిందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa