ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో నవదంపతుల ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 07:12 PM

ఏపీలోని ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ముక్తినూతలపాడులో ఉరి వేసుకుని ప్రియాంక తనువు చాలించింది. ఆమె మరణ వార్త విన్న భర్త పొదిలి మహానంది కూడా ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చత్తీస్‌ఘడ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా మహానంది పని చేస్తున్నాడు. నవ దంపతుల మృతి వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa