ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం: వెల్లంపల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:23 PM

పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్లో పర్యటనలో భాగంగా సోమవారం నాడు 51 వ డివిజన్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక కార్పొరేటర్ రాజేష్ మరియు నగర పాలక సంస్థ అధికారులతో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటన రాఘవరెడ్డి రోడ్ లోగల ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమై కుమ్మరి విధులు పితాని అప్పలస్వామి వీధి మీదగా కొండ ప్రాంతానికి ఎక్కి ఇల్లిపిల్లి వారి వీధి మీదుగా అడ్ రోడ్డు మొత్తం ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు అందరూ మంత్రిగారికి అనేక సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో విజయవాడ నగరంలో అభివృద్ధి శూన్యం అని నేడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడ నగరంలో పార్కులు రోడ్లు అభివృద్ధి చెందయిన్నారు. ముఖ్యమంత్రి ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో నగర వ్యాప్తంగా అనేక ఆసుపత్రిల అభివృద్ధికి సుమారు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని దానిలో భాగంగా మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిని అభివృద్ధి చెస్తున్నామన్నారు. స్థానిక ప్రజలు అందరూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల దోమలు ఎక్కువగా ఉంటున్నాయని దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారన్నారు. ఈ సందర్భంగా త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చెసెవిధంగా చర్యలు చెపట్టలని అధికారులకు సుచించారు. నగరంలో అనేక వేల మందికి జగన్నా ఇల్లు ఇచ్చిన ఘనత జగన్నా ప్రభుత్వదాన్నారు. ఈ సందర్భంగా నగర అభివ్రుద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నగర అభివృద్ధికి సహకరిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్లు మరియు నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa