ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు జగనన్న తోడు...ఖాతాల్లోకి సొమ్ము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 04:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మరోమారు జగనన్న తోడు  పథకం కింద నిధులు  మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నిధులను రేపు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఒక్క బటన్ క్లిక్ చేసి దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జగనన్న చేదోడు పథకం కింద షాపులు కలిగి ఉన్న 1.46 లక్షల మంది దర్జీలు , 98 వేల మంది రజకులు, 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ది చేకూరనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa