విశాఖపట్నం నగరంలో రౌడీషీటర్లు, కేడీలు, డీసీలతోపాటు సస్పెక్ట్షీట్ కలిగినవారిపై సీపీ మనీష్కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నగరంలో ఇటీవల కాలంలో రౌడీలు, కేడీల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీ వారికి అడ్డుకట్ట వేయడంపై దృష్టిసారించారు. శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రౌడీషీటర్లపై నిఘాను పటిష్ఠం చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సీపీ ప్రకటించినట్టుగానే నగర పోలీసులకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో నగరంలోని శాంతిభద్రతల పోలీసులతోపాటు క్రైమ్ పోలీసులు కూడా రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగినవారిని స్టేషన్లవారీగా పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. టాస్క్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ త్రినాథరావుతోపాటు ఎస్ఐ వాసునాయుడు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేశారు. ఇకపై ప్రతీ ఆదివారం కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిందేనని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరం నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని రౌడీ, కేడీ, డీసీ షీట్ కలిగివున్నవారిని వన్టౌన్ సీఐ వెంకటనారాయణ ఆదేశించారు. గతంలో ఇళ్లలో చోరీలు, ఆలయాల్లో చోరీలు, చైన్స్నాచింగ్లు, వాహనాలు చోరీలు, గంజాయి, మాదకద్రవ్యాలు వినియోగం, విక్రయం, రవాణా చేసేవారికి కూడా సంబంధిత క్రైమ్ విభాగం పోలీసులు కౌన్సెలింగ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa