ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కృష్ణ జిల్లాలో కొత్తగా 220 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 06:45 PM

కృష్ణ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 220 కరోనా కేసులు నమోదయినట్టు రాష్ట్ర వైద్య అధికారులు సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఆదివారం 352 కేసులు నమోదు అవగా సోమవారం 132 కేసులు తక్కువగా నమోదయ్యాయి. సోమవారం వచ్చిన కేసులతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 8821 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 1483 మంది కరోనా బారినపడి మృతి చెందారు.
జిల్లాలో కరోనా మొదటి, రెండో దశలలో భారీగా కేసులు నమోదు అవ్వడంతో పాటు చాలా మంది మృతి చెందారు. మళ్ళీ కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ ను, నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కావున ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇంట్లో నుంచి అవసరం అయితేనే బయటికి రావాలని, వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa