ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిజాబ్ వివాదం.. విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 05:34 PM

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఆందోళనలను కలిగిస్తుంది. మ్యాండ్య,శివమొగ్గ, చిక్ మంగళూరు జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పీయూఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ముస్లిం అమ్మాయి బుర్కా వేసుకొని కాలేజీకి రావడంతో హిందూ యువకులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా ఆ యువతి అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేసింది. హిజాబ్ అంశం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. తీర్పు వచ్చే వరకు అంతా సంయమనంగా ఉండాలని కర్ణాటక సీఎం విజ్ఞప్తి చేశారు. 3 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కన్నడ ప్రభుత్వం ఏకరూప దుస్తులు ధరించి రావాలని ఆదేశాలు జారీ చేసింది. బుర్కా వేసుకొని వచ్చే వారిని అనుమతించడం లేదు. దీంతో కన్నడ నాట వివాదం రగిలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa