ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో కొత్తగా 1,891 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 06:37 PM

ఆంద్రా ప్రదేశ్ కరోనా ఇంతకు ముందుతో పోలిస్తే తగ్గు ముఖం పెట్టిందనే చెప్పాలి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 26,236 శాంపిళ్లను పరీక్షించగా, 1,891 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 440 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 356, గుంటూరు జిల్లాలో 222, పశ్చిమగోదావరి జిల్లాలో 186, ప్రకాశం జిల్లాలో 141, విశాఖపట్నంలో 121 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో, 10,241 మంది కరోనా నుండి కోలుకున్నారు మరియు ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,06,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22,38,226 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 54,040 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 14,677కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa