ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కేసులు ఇవాళ మరోసారి తగ్గిపోయాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ 800 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 896 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2312029 కి పెరిగింది. కోవిడ్ వల్ల అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు మరియు విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 14,694కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24454 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8,849 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2272881 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 24,066 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,28,09,000 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa