ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన విఆర్ఎ లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 12:52 PM

విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) తాడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లి తాహశీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న విఆర్ఎ ల రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 19 వ రోజుకు చేరుకున్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో విఆర్ఎ లు బిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో సాయిబాబా గుడి వద్ద నుంచి నేతాజీ సెంటర్ వరకు ర్యాలీగా బిక్షాటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రాతూరు ప్రభాకరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, కొట్టె కరుణాకరరావు, దొంతిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, విఆర్ఎ లు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa