ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6. 18 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 04:51 PM

విశాఖ జిల్లా కేంద్రం విజయనగరంలో సంచలనం కలిగించిన రవి జ్యువెలరీ షాపులో ఈ నెల 23న జరిగిన బంగారం చోరీ కేసును విజయనగరం ఒకటవ పట్టణ పోలీసులు, సీసీఎస్ పోలీసులు ఛేదించారు. దొంగతనం జరిన రెండు రోజుల్లోనే నిందితుడిని చత్తీస్ ఘడ్ లోఅరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6. 18 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ కేసుతో పాటు మరో 3 చోరీ కేసుల్లో నిందితుడు (లోకేష్ శ్రీవాస్) అతని వద్ద నుంచి  90. 52 గ్రాముల సిల్వరు బ్రాస్ లెట్లు, రూ. 15 వేలు నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఎం. దీపిక స్వస్టం చేశారు. ఈ కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందించిన ఎస్పీ నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa