ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా గ్యాస్ రాయితీ తగ్గించేస్తున్న కేంద్ర ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 12:14 PM

ఒకపుడు గ్యాస్ ధర పెరిగిన ప్రభుత్వం వాటిని సబ్సిడీ రూపంలో ఆదుకొంటుందన్న ధీమా ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు ఇచ్చే సబ్సీడీ భారీగా తగ్గించేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెల్లించే గ్యాస్ సబ్సిడీ భారీగా తగ్గిపోయింది. ఆర్థిక సంవత్సరం 2022లో తొలి తొమ్మిది నెలల కాలంలో కంపెనీలు చెల్లించిన గ్యాస్ సబ్సిడీ రూ.2,706 కోట్లకు దిగొచ్చింది. ఈ సబ్సిడీ 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.37,585 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌టీఐ క్వరీలో వెల్లడైంది. ఈ క్వరీని నాగ్‌పూర్‌కు చెందిన అభయ్ కొలార్కర్ అనే వ్యక్తి దాఖలు చేశాడు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నుంచి గ్యాస్ సబ్సిడీకి చెందిన వివరాలు కావాలంటే అభయ్ కోరారు. గత ఐదేళ్లలో దేశీయ గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు ఏ మేర సబ్సిడీ అందించాయో తెలుపాలని కోరారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) రిటైల్ ధరలను పెంచుతోన్న ప్రభుత్వం తనపై ఉన్న రాయితీ భారాన్ని తగ్గించుకుంటోంది. ప్రస్తుతం వంటగ్యాస్‌ను 39 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. గ్లోబల్‌గా ఆయిల్, గ్యాస్ ధరలు తగ్గిన ఈ సమయంలో కూడా ప్రభుత్వం ధరలను పెంచింది. ప్రస్తుతం ఫ్యూయల్ ధరలు ఆకాశాన్నంటి కూర్చున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ప్రభావంతో అంతర్జాతీయంగా గ్యాస్ సప్లయిలో అంతరాయాలు ఏర్పరడుతున్నాయి. ఈ సమయంలో ధరలు ఏ విధంగా పెరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2018-19లో ఇచ్చిన ఆర్‌టీఐ సమాధానంలో మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సబ్సిడీ కింద రూ.37,585 కోట్లను చెల్లించాయి. ఇవి డిసెంబర్ నాటికి రూ.2,706 కోట్లకు దిగొచ్చాయని ఆర్‌టీఐ సమాధానంలో వెల్లడైనట్టు కొలార్కర్ తెలిపారు. గత ఐదేళ్లలో సిలిండర్ ధర 100 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం గ్యాస్‌పై ఉన్న సబ్సిడీని కూడా తగ్గించిందని కొలార్కర్ అన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.900గా ఉంది. కానీ సబ్సిడీ కేవలం రూ.40.10 మాత్రమేనని తెలిపారు. వెంటనే సబ్సిడీలను పునరుద్ధరించాలని కోరారు. ఇధిలావుంటే కంపెనీల వారీగా అవి చెల్లించిన సబ్సిడీలను చూసుకుంటే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 2021-22 తొలి తొమ్మిది నెలల్లో రూ.1,369 కోట్లను, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ రూ.716 కోట్లను, బీపీసీఎల్ రూ.621 కోట్లను మాత్రమే సబ్సిడీగా చెల్లించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa