ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చౌకగా బంగారు కొనుగోలు చేయాలనుకొంటున్నారా...? అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టండి

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 12:15 PM

బంగారం ధర రోజురోజకు ఎగబాకడం తప్పా తగ్గే పరిస్థితి మనం చూడటంలేదు. అందుకే చౌకగా బంగారం వస్తుందంటే ఎవరు కాదన్నారు. కాకపోతే మనం కాస్త ఇన్వేస్ట్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆప్షన్ ఇదే. ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టి సురక్షితమైన రిటర్నులను పొందండి. ఎల్లుండి(ఫిబ్రవరి 28, 2022) నుంచే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను తెరుస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం చౌకగా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్(ఎస్‌జీబీ) స్కీమ్‌ను 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెల చివరి నుంచి తెరుస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. దీనిలో ఇష్యూ ధర ఒక్కో గ్రాముకు రూ.5,109గా నిర్ణయించింది. ఒకవేళ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే... మీరు సోమవారం తెరవబోయే సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 10వ సిరీస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 4, 2022 వరకు ఈ సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌కి ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. డిస్కౌంట్‌లో ఇష్యూ ధర ఇలా ఉండనున్నది. ఈ ఐదు రోజులలో సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి ఒక్కో గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ పొందాలంటే.. వారు డిజిటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 10వ సిరీస్ కింద ఒక్కో గ్రాము రూ.5,059కే లభించనుంది. ప్రభుత్వ తరఫున రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేస్తుంది. ఈ బాండ్లను అన్ని బ్యాంకులు విక్రయిస్తాయి. బ్యాంకులతో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌హెచ్‌సీఐఎల్), పోస్టాఫీసు అండ్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ), బొంబై స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్ఈ)లు ఈ బాండ్లను విక్రయిస్తాయి. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒక వ్యక్తి 4 కేజీల గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. అదే సమయంలో, కనిష్ట పెట్టుబడి ఒక గ్రాముగా ఉండాలి. ట్రస్టులు, సంస్థలు 20 కేజీల వరకు బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa