ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింత పెరగనున్న కార్ల తయారీ ముడిసరకుల ధరలు...ఇక ప్రీయంగా మారనున్న వాహనాలు

international |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 12:17 PM

ఇప్పటికే ముడిసరుకుల ధరలు పెరగడంతో కార్ల తయారీ సంస్థలన్నీ ధరలు పెంచేశాయి. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న భీకర దండయాత్రతో భారతీయ వాహనాదారులకు రెండు రకాలుగా ప్రభావం చూపబోతుంది. ఒకటి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని అంచనాలుండగా... రెండోది ఇప్పుడు కార్లను కూడా వినియోగదారులు కొనలేరని తెలుస్తోంది. ఈ వార్‌తో ఇన్‌పుట్ ఖర్చులు భారీగా పెరుగుతాయని, దీంతో కార్ల ధరలకు రెక్కలొస్తాయని అంచనాలున్నాయి. అంతేకాక ప్రస్తుతం వెహికిల్స్ కోసం ఎదురుచూస్తోన్న వినియోగదారులు మరింత ఎక్కువ కాలం వేచిచూడాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ సప్లయిస్‌లో ఇబ్బందుల వల్ల కార్ల కోసం ఎక్కువ కాలం ప్రజలు వేచిచూడాల్సి వస్తుంది. బుక్ చేసుకున్న వెంటనే కార్ల డెలివరీ ఉండటం లేదు. ఎన్నో నెలలకు కానీ కారు ఇంటి ముందుకు చేరడం లేదు. కొన్ని కార్ల కోసం ఎక్కువ కాలం పాటు వేచిచూడాల్సి వస్తుంది. డిమాండ్ ఎక్కువ వస్తున్న సమయంలో కంపెనీలు బుకింగ్‌లను నిలిపివేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇన్‌పుట్ ఖర్చుల విషయంలో ఎలాంటి ప్రభావాన్ని తాము చూడలేదని, కానీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఒక వెహికిల్ తయారీదారి చెప్పారు. మరోవైపు క్రూడాయిల్ ధర గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా 100 డాలర్లను క్రాస్ చేసింది. వెహికిల్ తయారీలో వాడే అత్యంత కీలకమైన మెటీరియల్ అల్యూమినియం ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ప్లాటినం, పెల్లేడియం, రోడియం వంటి విలువైన మెటల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. వీటిని ఆటోమొబైల్స్ తయారీలో వాడతారు. ఈ ధరలు 30 నుంచి 36 వారాల గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ మెటల్స్‌ను సరఫరా చేసే దేశాలలో రష్యా, ఈస్ట్రన్ యూరప్‌లు కీలకంగా ఉంటున్నాయి. పెల్లేడియం ధరలు ప్రస్తుత క్వార్టర్‌లో 30 శాతం వరకు పెరిగాయి. మొత్తం ముడిసరుకుల ఖర్చులలో 10 శాతం నుంచి 15 శాతంగా ఉండే అల్యూమినియం కూడా 20 శాతం ఖరీదైనదిగా మారింది. దీంతో ముడిసరుకుల ఖర్చులు భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. ఆటోమేకర్ల రెవెన్యూలలో 78 శాతం నుంచి 84 శాతం వరకు ముడిసరుకుల ఖర్చులకే పోతుంటాయి. ఒకవేళ ఈ ఖర్చులు మరింత పెరిగితే.. కంపెనీల లాభాలు పడిపోతాయి. దీంతో ధరలు పెరుగుతాయి. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం కూడా వడ్డీ రేట్లను పెంచుతోంది. దీంతో కారు కొనుగోలు ఖర్చు కూడా పెరగనుంది. మరోవైపు పెల్లేడియం సప్లయిలో 35 శాతం వాటా రష్యాదే ఉంది. ఈ అరుదైన మెటల్‌ను సెమీకండక్టర్ల తయారీలో వాడతారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలన్ని పెల్లాడియం కోసం రష్యాపైనే ఆధారపడుతుంటాయి. ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన ఈ లోహానికి డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో.. కొరత కూడా ఎక్కువే. ఆశ్చర్యకరంగా బంగారం, ప్లాటినం కంటే కూడా పెల్లాడియం ధరనే ఎక్కువ. ఒక గ్రాము పెల్లాడియం ధర రూ.6,188. కిలో కావాలంటే రూ.61 లక్షల పైనే చెల్లించాలి. పెట్రోల్, హైబ్రిడ్ కార్లలో ఈ లోహాన్ని వాడతారు. డిజిటల్ కంటే పెట్రోల్ కార్ల వినియోగం పెరగడంతో.. తక్కువ హాని కలిగింగే నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ కన్వర్ట్ చేయడానికి ఎగ్జాస్ట్స్‌లలో 80 శాతం పెల్లాడియం వాడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa