ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బట్టబయలైన ఓ కిలాడీ పెళ్లి కూతురు బాగోతం

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 01:44 PM

మధ్యప్రదేశ్‌లో ఓ కిలాడీ పెళ్లి కూతురు బాగోతం బట్టబయలయింది. పెళ్లిళ్లు చేసుకుని అత్తింటి నుంచి సొమ్ము కాజేసి పారిపోవడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. తాజాగా మరో యువకుడిని కూడా ఆమె ఇలాగే మోసం చేసింది.
వివరాల్లోకి వెళితే.. రాజ్‌నగర్‌లోని దల్పత్‌పురా ప్రాంతానికి చెందిన సోహన్ లాల్ అహిర్వార్ వివాహం ఈ ఏడాది ఆరంభంలో ఘనంగా జరిగింది. దినేష్ సాకేత్ అనే వ్యక్తి అతనికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. జనవరి 10న పుష్పా దేవి అనే యువతి ఉందని, చాలా మంచి అమ్మాయని చెప్పి పెళ్లికి ఒప్పించాడు. సోహన్ లాల్ కుటుంబ సభ్యులు, బంధువులు సత్నాకు వెళ్లారు. అక్కడ గీర్వా మాత ఆలయంలో వివాహం జరిగింది. అదే రోజు వధూవరులు దల్పత్‌పురాకు వెళ్లారు. పుష్పా దేవి 15 రోజుల పాటు అతడితో కాపురం చేసింది. పుష్పా దేవికి సోహాన్ రూ.13వేలు విలువైన ఫోన్ కొనిచ్చాడు. అతడి తండ్రి కోడలి కోసం లక్షనర్న రూపాయలను వడ్డీకి తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 10న అందరూ నగలు తీసుకోవడానికి సోనార్‌కి వెళ్లాల్సి ఉంది.
పుష్పా దేవి తన భర్తను టిఫిన్ తీసుకురావాలని బయటకు పంపించి దినేష్‌ అనే యువకుడితో కలిసి పారిపోయింది. ఫోన్, డబ్బులు, నగలతో వారు పరారయ్యారు. పుష్పాదేవి పచ్చి మోసగత్తె అని సోహన్ లాల్‌ కు అర్ధమయింది. దినేష్, పుష్ప కలిసి పెళ్లి పేరుతో తనను మోసం చేశారని తెలుసుకున్నాడు. చాలాసార్లు ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు ఒకసారి ఫోన్ ఎత్తి మాట్లాడిన పుష్ప నీతో ఉండడం నాకు ఇష్టం లేదని, మళ్లీ కాల్ చేస్తే బాగోదని హెచ్చరించింది.
దినేష్, పుష్ప ప్రేమికులు. వీరిద్దరు కలిసి ఇప్పటి వరకు ఎంతో మందిని పెళ్లి పేరుతో మోసం చేశారు. సోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పుష్పా దేవి తండ్రి పేరు ప్యారే లాల్ అహిర్వార్. వారిని యూపీలోని సతారీ జిల్లా చువారి గ్రామం. ఈ వివరాలతో పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులను ఆరాతీశారు. పుష్పా దేవి ఐదేళ్ల క్రితమే ఓ యువకుడితో కలిసి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిందని, మళ్లీ రాలేదని చెప్పారు. ఐతే దినేష్ సాకేత్, పుష్పా దేవి కలిసి ఇలా పెళ్లిళ్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa