ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక-భారత్ జరుగుతున్న సమయంలో ఆసక్తికర ఘటనలు

sports |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 03:32 PM

సహజంగా మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య జరిగే ఆట తీరునే చూస్తారు. కానీ ఆ మ్యాచ్ జరిగే సమయంలో చోటుచేసుకొనే  ఇతర అంశాలను విస్మరిస్తారు. శ్రీలంక-భారత్ జట్ల మధ్య ధర్మశాలలో శనివారం జరిగిన టీ20 రెండో మ్యాచ్ లో ఒక దృశ్యం ఆకట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 184 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. కానీ, ఫామ్ లో ఉన్న భారత జట్టు సునాయాసంగానే దీన్ని సాధించేసింది. కాకపోతే ఆట మొదటి భాగం ఆసాంతం ఉత్కంఠ మధ్య నడిచింది. హిమగిరులకు దగ్గరగా ఉండటంతో ధర్మశాలలో ఉష్ణోగ్రత 4-8 డిగ్రీల మధ్య ఉంది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి వర్షపు జల్లులు పలకరించాయి. దీంతో వాతావరణం చల్లగా మారిపోయింది. భారత జట్టు కెప్టెన్, ఓపెనర్ గా వచ్చిన రోహిత్ ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్డాడు. కానీ, అక్కడి నుంచి ఆటను మాత్రం చాలా చక్కగా ఆస్వాదించాడు. శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ మెరుపులు చూస్తూ, విజయం ఖాయమన్న ధీమాతో కనిపించాడు. అదే సమయంలో చల్లటి వాతావరణం నుంచి ఉపశమనంగా కాఫీ తాగుతూ కనిపించాడు. కెమెరా మ్యాన్ కెమెరాను రోహిత్ వైపు తిప్పాడు. దీంతో రోహిత్ కెమెరా మ్యాన్ ను గమనించి కాఫీ కావాలా? అంటూ సైగలు చేశాడు. అలా పలు పర్యాయాలు కాఫీ కావాలా? అని అడగడం కనిపించింది. ఈ వీడియోను బీసీసీఐ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. (వీడియో లింక్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa