ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీలో పరస్పర దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 12:41 PM

గుంటూరు: స్థలానికి సంబంధించిన వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కారంపూడి రోడ్డు లోని ఓ హోటల్ వద్ద మంగళవారం రాత్రి మేనమామ ఎర్రవలి, మేనల్లుడు అబ్దుల్లా మధ్య పెద్దల సమక్షంలో పంచాయతి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి. ఇరు వర్గాలకు చెందినవారు ఘర్షణ పడ్డారు. ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఎర్రవలి, అహ్మద్, కరీముల్లా కు గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏ ఎస్ ఐ స్టాలిన్ బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఘర్షణలో అబ్దుల్లాకు కూడా గాయాలైనట్లు అతని వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa