ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ

international |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 06:07 PM

ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత పౌరులందరినీ వెంటనే ఖార్కివ్‌ నగరాన్ని విడిచిపెట్టాలని సూచించింది. దీనిపై అత్యవసర ఆదేశాలు అందజేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికల్లా ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పెసోచిన్, బాబాయే, బెజ్లియుడోవ్కా స్థావరాలకు చేరుకోవాలని పేర్కొంది.
అంతకుముందు, పోలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి కూడా ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచన విడుదల చేసింది. పోలండ్‌లోకి త్వరగా రావాలని, బుడోమియర్జ్ సరిహద్దుకు వీలైనంత త్వరగా చేరుకోవాలని కోరింది. కీవ్‌లోని భారతీయ పౌరులకు మంగళవారం, మార్చి 1న ఇదే విధమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఇతర మార్గాల ద్వారా రాజధానిని విడిచిపెట్టమని వారిని కోరింది. అయితే తమను ఉక్రెయిన్ రైల్వే అధికారులు కొడుతున్నారని, రైలు ఎక్కకుండా ఈడ్చి పడేస్తున్నారని పలువురు భారత విద్యార్థులు వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa