ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కార్ నీటితో మినరల్ దందా..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 01:24 PM

తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలం లో ప్రజలకు తాగునీటి కష్టాలు సాధారణం కానీ నిత్యం నిండు కుండ లాంటి కృష్ణమ్మ తల్లి ఒడిలో ఉన్న గ్రామాలకు సైతం నీటి ఎద్దడి తప్పడం లేదు. కానీ అది ప్రకృతి సృష్టించిన నీటి కొరత కాదు. కొందరు అక్రమార్కుల ధనార్జన కోసం తాగునీటి ఎద్దడి సృష్టిస్తున్న పరిస్థితి. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని మినరల్ మాఫియా దందా గ్రామానికి శాపంగా మారుతోంది. ప్రజలకు అందాల్సిన సర్కారీ తాగునీటిని దోచుకుంటూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయితీ నీటి కుళాయిలను నేరుగా మినరల్ వాటర్ ప్లాంట్ కు అనుసంధానం చేసి దర్ఖా గా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం ఏకంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కు నీటి ఎద్దడిని సృష్టిస్తున్న దుస్థితి. గ్రామ ప్రజలకు చెందాల్సిన నీటిని వినియోగిస్తూ దర్జాగా మినరల్ వాటర్ మాఫియాను కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున తాగునీటి దోపిడి జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావు ఇస్తుంది. ఇక్కడ ఇంకో ఆసక్తి కర విషయం ఏమిటి అంటే ఐఎస్ఐ మార్కు మినరల్ వాటర్ ప్లాంట్ అంటూ నీటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ ల పై చర్యలు తీసుకోవాలని అనేక మార్లు అధికారులకు పిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని మినరల్ వాటర్ దందా పై ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మూలపాడు గ్రామం లో జరుగుతున్న నీటి దోపిడీని అరికట్టి ప్రజలకు తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa