స్పందన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని జేసీ జి. రాజకుమారి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం గుంటూరు డివిజన్స్థాయి స్పందన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలకు సక్రమైన పరిష్కారం చూపి పోర్టల్లో అప్లోడ్ చేసిన తరువాతే ఆన్లైన్లో క్లోజ్ చేయాలని తెలిపారు. పరిష్కరించడానికి వీలు కాని అర్జీలను పూర్తి వివరణతో నివేదిక తయారు చేసి అర్జీదారుని సంతకంతో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కరరెడ్డి, డివిజన్ పరిధిలోని మున్సిపల్ కమీషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa