ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్ స్వీచ్ వేసేందుకు భయపడుతున్నారు: భాను ప్రకాశ్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 01:18 PM

ఫ్యాన్ స్వీచ్ వేయాలన్న ఏపీ  ప్రజలు భయపడుతున్నారని బీజేపీ అధికార పత్రినిధి భానుప్రకాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని... ఫ్యాన్ స్విచ్ వేసేందుకు కూడా భయపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు పెద్ద షాక్ ఇస్తారని జోస్యం చెప్పారు. ఏపీని అవినీతిప్రదేశ్, అంధకారప్రదేశ్ గా మారుస్తున్నారని విమర్శించారు.  కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జనాల నడ్డి విరుస్తున్నారని అన్నారు. తాడేపల్లి ప్యాలస్ ను వదిలి జగన్ బయటకు రావాలని... ప్రజలతో కలిసి వారం రోజుల పాటు గుడిసెల మధ్య నివసించాలని సలహా ఇచ్చారు. జనాల్లోకి వస్తే వారి బాధలేంటో అర్థమవుతాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa