ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఈరోజు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో సన్రైజర్స్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ దీపక్ హుడా అర్ధ సెంచరీలతో రాణించారు.ఓపెనర్గా వచ్చిన రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 68 పరుగులు చేయగా, దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఆయుష్ బడోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసాడు. దీంతో సన్ రైజర్స్ ముందు టార్గెట్ 170 పరుగులు నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa