ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టం: నక్కా ఆనంద్ బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 10:28 PM

జిల్లాల విభజన వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించిందని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. తెనాలితో వేమూరుకు శతాబ్దాలుగా అనుబంధం ఉందని, ఇప్పుడు విడిపోతున్నామని చెప్పారు. వేమూరుని కూతవేటు దూరంలో ఉన్న తెనాలిలో కలపకుండా బాపట్లలో కలపడం దారుణమని అన్నారు. వేమూరు ప్రజలకు ఈరోజు దుర్దినమని చెప్పారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున నోరు మెదపకపోవడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా విధ్వంసాలకు జిల్లాల విభజన ఒక తార్కాణంగా నిలుస్తుందని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఎంత బాధ పడ్డామో... ఇప్పుడు జిల్లాల విభజనతో కూడా అంతే బాధపడుతున్నామని అన్నారు. ఈ రెండు చీకటి దినాలుగా మిగిలిపోతాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa