ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 170 పరుగులు

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 10:33 PM

ఐపీఎల్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. తాజాగా ముంబయిలో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు 170 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ దీపక్ హుడా అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా, వేగంగా ఆడిన దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 51 పరుగులు సాధించాడు. యువ బ్యాట్స్ మన్ ఆయుష్ బదోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. అంతకుముందు, ఓపెనర్ క్వింటన్ డికాక్ 1, ఎవిన్ లూయిస్ 1 పరుగుకే అవుటై నిరాశపరిచారు. మనీష్ పాండే 11, కృనాల్ పాండ్య 6, జాసన్ హోల్డర్ 8 (నాటౌట్) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa