వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. అసలు వైసీపీకి ఓటు అడిగే హక్కే లేదని కూడా ఆయన తేల్చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన పవన్...2024 ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ ఏమన్నారంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదు. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదు. ఇది కొత్త తరం రాజకీయం. పాత తరం కాదు. వైసీపీ ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించి చెప్పా. శ్రీలంకలా ఏపీ అవ్వొద్దనే ఆ మాట అన్నా.నా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వ్యూహం నాకు వదిలేయండి చాలు. నేను ఎవరి పల్లకీ మోయడానికి రాలేదు. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే వచ్చా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa